రియా చక్రవర్తి పై FIR నమోదు చేసిన సీబీఐ!
- August 06, 2020పాట్నా:సుశాంత్ సింగ్ బలవన్మరణం బాలీవుడ్ ను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులనీ ఈ కేసు విషయం లో విచారణ జరపగా ఎన్నో విషయాలు బయటికి వచ్చాయి. అంతేకాక ఈ కేసు ను సీబీఐ కి కూడా అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా సీబీఐ అధికారులు సుశాంత్ సింగ్ ప్రియురాలు అయిన రియా చక్రవర్తి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు లో రియా తో పాటుగా మరి కొంత మంది పేర్లను సైతం సీబీఐ వారు జత చేశారు.
అయితే రియా చక్రవర్తి పై సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలు సీబీఐ సీరియస్ గా తీసుకుంది. మనీ లాండరింగ్ జరిగిన విషయం పై ఈ డి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాక తమ ఎదుట హజరు ఈ నెల 7 న కావాలని ఈ డి కోరిన విషయం తెలిసిందే. రియా చక్రవర్తి కి సుశాంత్ సింగ్ అకౌంట్ నుండి 15 కోట్ల రూపాయలు చేరినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం కాక, రియా ఆస్తుల పై కూడా ఆరా తీయనున్నరు.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ