బీరుట్ కు సౌదీ సాయం..సహాయసామాగ్రితో లెబనాన్ వెళ్లిన విమానం
- August 07, 2020
రియాద్:భారీ పేలుడుతో అల్లకల్లోలంగా మారిన లెబనాన్ రాజధాని బీరుట్ ప్రజలకు చేదోడుగా నిలిచింది సౌదీ ప్రభుత్వం. కింగ్ సల్మాన్ మనవతాదృక్ఫథం సహాయ కేంద్రం నుంచి బీరుట్ ప్రజలకు అవసరమైన సహాయ సామాగ్రితో తొలి విమానం లెబనాన్ కు బయల్దేరింది. భారీ పేలుడు బాధితులకు మానవీయకోణంలో ఆదుకోవటం కోసం అవసరమైన మెడిసిన్, అహారాన్ని సౌదీ ప్రభుత్వం సాయంగా అందిస్తోంది. గత మంగళవారం బీరుట్ పోర్టులో భారీ పేలుడు సంభవించటంతో దాదాపు 135కి మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 4 వేల మందికిపై గాయపడ్డారు. కొందరు ఇళ్లు నేలమట్టమై రోడ్డునపడ్డారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు చేదోడుగా నిలవాలని భావించిన సౌదీ ప్రభుత్వం దాదాపు 120 టన్నుల మెడిసిన్స్, వైద్య పరికరాలు, అత్యవసరంగా ఉపయోగపడే సామాగ్రి, అహారం, టెంట్లు, షెల్టర్ కిట్స్ విమానాల ద్వారా తరలిస్తోంది. వీటిని బాధితులకు అందించేందుకు ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!