బీరుట్ కు సౌదీ సాయం..సహాయసామాగ్రితో లెబనాన్ వెళ్లిన విమానం
- August 07, 2020
రియాద్:భారీ పేలుడుతో అల్లకల్లోలంగా మారిన లెబనాన్ రాజధాని బీరుట్ ప్రజలకు చేదోడుగా నిలిచింది సౌదీ ప్రభుత్వం. కింగ్ సల్మాన్ మనవతాదృక్ఫథం సహాయ కేంద్రం నుంచి బీరుట్ ప్రజలకు అవసరమైన సహాయ సామాగ్రితో తొలి విమానం లెబనాన్ కు బయల్దేరింది. భారీ పేలుడు బాధితులకు మానవీయకోణంలో ఆదుకోవటం కోసం అవసరమైన మెడిసిన్, అహారాన్ని సౌదీ ప్రభుత్వం సాయంగా అందిస్తోంది. గత మంగళవారం బీరుట్ పోర్టులో భారీ పేలుడు సంభవించటంతో దాదాపు 135కి మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 4 వేల మందికిపై గాయపడ్డారు. కొందరు ఇళ్లు నేలమట్టమై రోడ్డునపడ్డారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు చేదోడుగా నిలవాలని భావించిన సౌదీ ప్రభుత్వం దాదాపు 120 టన్నుల మెడిసిన్స్, వైద్య పరికరాలు, అత్యవసరంగా ఉపయోగపడే సామాగ్రి, అహారం, టెంట్లు, షెల్టర్ కిట్స్ విమానాల ద్వారా తరలిస్తోంది. వీటిని బాధితులకు అందించేందుకు ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







