ఖతార్ కు NRIల తిరుగు ప్రయాణంపై కసరత్తు..భారత రాయబార కార్యాలయం ప్రకటన
- August 07, 2020దోహా:ఇండియా నుంచి ఖతార్ తిరిగి వెళ్లాలనుకుంటున్న ప్రవాసభారతీయులకు సంబంధించి తాము తగిన కసరత్తు చేస్తున్నామని ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. సరైన రెసిడెన్సీ పర్మిట్ ఉండి ఖతార్ తిరుగు ప్రయాణం చేయాలనుకుంటున్నవారు తమ సూచనలు ఎప్పటికప్పుడు గమనించాలని కోరింది. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని అయినా తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తామని కూడా వెల్లడించింది. ఖతార్ తిరుగు ప్రయాణం అయ్యే భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం చేసేలా తాము కసరత్తు చేస్తున్నామని వివరించింది. అయితే..తమ సూచనలు అందేవరకు ఎవరూ ముందస్తుగా విమాన టికెట్లను బుక్ చేసుకోవద్దని కూడా హెచ్చరించింది. కొన్ని సంస్థలు, ఏజెంట్లు సోషల్ మీడియా వేదికగా ఖతార్ ప్రయాణానికి టికెట్లు అమ్మకాలు జరుపుతున్నారని..ప్రస్తుతానికి ఖతార్-భారత్ మధ్య రెగ్యూలర్ విమాన సర్వీసులు నడవటం లేదన్న విషయాన్ని గమనించాలని రాయబార కార్యాలయం కోరింది. అయితే..కొన్ని ప్రత్యేక అనుమతులపై ఆరోగ్య రంగ ఉద్యోగులు, అత్యవసర సర్వీసు ఉద్యోగులు ఛార్టెడ్ విమానాల ద్వారా ప్రయాణిస్తున్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్