ఏపీలో మరోసారి పదివేలకు పైగా కరోనా కేసులు
- August 07, 2020అమరావతి:ఏ.పీలో గడిచిన 24 గంటల్లో 62,938 శాంపిల్స్ ను పరీక్షించగా 10,171 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,960 కు చేరింది. తాజా పరీక్షల్లో 29,154 ట్రూనాట్ పద్ధతిలో, 33,784 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. కొత్తగా 7,594 మంది వైరస్ బాధితులు కోలుకుని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,20,464 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 84,654 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో తాజాగా 89 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1842 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 23,62,270 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు