కేరళ ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ ఫోన్..
- August 07, 2020న్యూ ఢిల్లీ:కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిరిండియా విమాన ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కేరళ సీఎం పినరయి విజయన్కు ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు, బాధితులకు సాయంపై ఆరా తీశారు. కోజికోడ్, మలప్పురం జిల్లాల కలెక్టర్లు సహాయక చర్యలు చేపడుతున్నారని సీఎం పినరయి విజయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిపారు. మరికొందరు అధికారులు కూడా సహాయకచర్యల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఐజీ అశోక్ యాదవ్ కూడా ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వెంటనే సహాయకచర్యల్లో నిమగ్నం కావాలని ఆదేశించారు. మంత్రి ఏసీ మొయిద్దీన్కు సహాయకచర్యల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. మంత్రి మొయిద్దీన్ త్రిసూర్ నుంచి ఘటన స్థలానికి బయలుదేరారు. కోజికోడ్, మలప్పురం జిల్లాలకు చెందిన ఫైర్, రెస్క్యూ బృందాలు సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయి. విమాన ప్రమాదంపై సమగ్ర విచారణకు డీజీసీఏ ఆదేశించింది.
దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. రన్ వే మీద ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో విమానం ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. కోజికోడ్ ఎయిర్ పోర్టులో రన్ వే మీద నుంచి పక్కకి దూసుకుపోయింది. కేరళలో భారీ ఎత్తున వర్షం పడుతోంది. దీని వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 14 మంది చనిపోయినట్టు 123 మందికి గాయాలయ్యాయని తెలిసింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..