భారత్ లో కొత్తగా 61,537 కరోనా కేసులు
- August 08, 2020
భారత దేశంలో కరోనా కేసులు ఇటీవల రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం 62వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. శనివారం 61వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. మరోవైపు కరోనా మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,537 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 20,88,612కు చేరింది. ఇప్పటివరకూ14,27,006 మంది కరోనా నుంచి కోలుకుని కోలుకొని డిశ్చార్జి అవ్వగా.. 6,19,088మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్కరోజే 933 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం కరోనా మరణాలు 42,518కి పెరిగారు. అయితే, కరోనా పరీక్షలు కూడా రికార్డు స్థాయిలో జరుపుతున్నారు. శనివారం ఒక్కరోజే 5,98,778 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ప్రకటించింది. ఇప్పటివరకూ 2,33,87,171 కరోనా పరీక్షలు జరిగాయి. పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ కరోనా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండటం కాస్తా ఊరట కలిగిస్తుంది. దేశంలో కరోనా రికవరీ రేటు 68.32శాతంగా నమోదైంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!