గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన హీరో నాగ శౌర్య

- August 09, 2020 , by Maagulf
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన హీరో నాగ శౌర్య

హైదరాబాద్:ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని యువ హీరో నాగశౌర్య తెలిపారు.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతుంది.ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఫిల్మ్ నగర్ షేక్ పెట్ లోని తన నివాసంలో  మొక్కలు నాటిండు.అనంతరం మరో ముగ్గురు ( ప్రముఖ నటుడు జగపతి బాబు, హీరో నారా రోహిత్ , డైరెక్టర్ నందిని రెడ్డి ) లు కూడా మూడు మొక్కలు నాటి వారు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసరాలని యువ హీరో నాగశౌర్య అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com