ప్రజా పార్కింగ్ కోసం భూముల కొనుగోలు

- February 06, 2016 , by Maagulf
ప్రజా పార్కింగ్ కోసం భూముల కొనుగోలు

పెరుగుతున్న పార్కింగ్ సమస్యలను అధిగమించడానికి ప్రజల కోసం స్థలాల కోసం '  ఉమ్మ్ అల్ హస్సం 'ప్రాంతంలో భూముల కొనుగోలు కోసం ఒక మిలియన్ బి.డి.ల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఇందుకోసం ఖర్చు చేయనున్నట్లు పనులు , పురపాలక వ్యవహారాల పట్టణ శాఖ ఇటీవల ఒక ప్రకటన చేసింది. దీనికి 8 ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ఈ స్థలాలను ప్రజల పార్కింగ్ అవసరాల నిమిత్తం ఉపయోగించనున్నారు. ఈ చర్య ద్వారా 343 వాహానాలను పార్కింగ్ చేసుకొనేందుకు  వీలు కలుగుతుంది.పార్కింగ్ ఇబ్బందుల పై ఒక సమగ్ర అధ్యయనం సైతం జరిగింది. ఈ ప్రాజెక్ట్ భారీ వ్యయంతో కూదుకొన్నదని కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యంతో బహుళ అంతస్థుల పార్కింగ్ భవనం నిర్మించేందుకు ఈ రంగంలో పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు తెలిపారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com