ప్రజా పార్కింగ్ కోసం భూముల కొనుగోలు
- February 06, 2016
పెరుగుతున్న పార్కింగ్ సమస్యలను అధిగమించడానికి ప్రజల కోసం స్థలాల కోసం ' ఉమ్మ్ అల్ హస్సం 'ప్రాంతంలో భూముల కొనుగోలు కోసం ఒక మిలియన్ బి.డి.ల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఇందుకోసం ఖర్చు చేయనున్నట్లు పనులు , పురపాలక వ్యవహారాల పట్టణ శాఖ ఇటీవల ఒక ప్రకటన చేసింది. దీనికి 8 ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ఈ స్థలాలను ప్రజల పార్కింగ్ అవసరాల నిమిత్తం ఉపయోగించనున్నారు. ఈ చర్య ద్వారా 343 వాహానాలను పార్కింగ్ చేసుకొనేందుకు వీలు కలుగుతుంది.పార్కింగ్ ఇబ్బందుల పై ఒక సమగ్ర అధ్యయనం సైతం జరిగింది. ఈ ప్రాజెక్ట్ భారీ వ్యయంతో కూదుకొన్నదని కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యంతో బహుళ అంతస్థుల పార్కింగ్ భవనం నిర్మించేందుకు ఈ రంగంలో పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







