గంటకు 278 కిలోమీటర్ల వేగంతో పట్టుబడ్డ వాహనదారుడు
- August 10, 2020
షార్జా: షార్జాలోని ఓ ట్రాఫిక్ రాడార్, 278 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోన్న మోటరిస్టుని గుర్తించింది. ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ ట్రాఫిక్ మీడియా బ్రాంచ్ డైరెక్టర్ కెప్టెన్ సౌద్ అల్ షైబా మాట్లాడుతూ, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ట్రాఫిక్ రాడార్ గుర్తించిన అత్యధిక వేగం ఇదేనని చెప్పారు. నజ్వా - మలీహా రోడ్డుపై వాహనదారుడు ఈ వేగంతో దూసుకెళ్ళినట్లు ఆయన వివరించారు. సదరు వాహనదారుడికి సమన్లు జారీ చేశారు. గల్ఫ్ దేశానికి చెందిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. అతని వాహనాన్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అతి వేగం తమ ప్రాణాలతోపాటు, ఇతరుల ప్రాణాలకూ ముప్పు తెస్తుందని వాహనదారులు గుర్తించాలని కెప్టెన్ అల్ షైబా చెప్పారు. ఇతరుల్ని ప్రమాదంలోకి నెట్టేలా వ్యవహరిస్తే వాహనదారులపై డబుల్ పెనాల్టీస్ విధించడం జరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







