గంటకు 278 కిలోమీటర్ల వేగంతో పట్టుబడ్డ వాహనదారుడు
- August 10, 2020
షార్జా: షార్జాలోని ఓ ట్రాఫిక్ రాడార్, 278 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోన్న మోటరిస్టుని గుర్తించింది. ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ ట్రాఫిక్ మీడియా బ్రాంచ్ డైరెక్టర్ కెప్టెన్ సౌద్ అల్ షైబా మాట్లాడుతూ, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ట్రాఫిక్ రాడార్ గుర్తించిన అత్యధిక వేగం ఇదేనని చెప్పారు. నజ్వా - మలీహా రోడ్డుపై వాహనదారుడు ఈ వేగంతో దూసుకెళ్ళినట్లు ఆయన వివరించారు. సదరు వాహనదారుడికి సమన్లు జారీ చేశారు. గల్ఫ్ దేశానికి చెందిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. అతని వాహనాన్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అతి వేగం తమ ప్రాణాలతోపాటు, ఇతరుల ప్రాణాలకూ ముప్పు తెస్తుందని వాహనదారులు గుర్తించాలని కెప్టెన్ అల్ షైబా చెప్పారు. ఇతరుల్ని ప్రమాదంలోకి నెట్టేలా వ్యవహరిస్తే వాహనదారులపై డబుల్ పెనాల్టీస్ విధించడం జరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







