ఇండియాకి విమానాల పునఃప్రారంభంపై అల్ తాయెర్ గ్రూప్ ప్రకటన
- August 10, 2020
కువైట్: అల్ తాయెర్ గ్రూప్ మరియు లగ్జరీ ట్రావెల్స్, ఇండియాకి విమానాల్ని పునఃప్రారంభించే విషయమై ప్రకటన చేయడం జరిగింది. ఆగస్ట్ 11 నుంచి విమానాల పునరుద్ధరణ ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని గ్రూప్ సీఈఓ ఫహాద్ అల్ బాకర్ వెల్లడించారు. ఢిల్లీ, విజయవాడ, చెన్నయ్, ముంబై, హైద్రాబాద్ మరియు కొచ్చిన్లకు విమానాల్ని పునఃప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ గ్రూప్ నుంచి కువైట్ ఎయిర్వేస్ విమానాల్ని ఈ డెస్టినేషన్స్కి ఆఫర్ చేస్తున్నట్లు వివరించారు. ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్షలు చేసే సౌకర్యాన్ని కూడా సమకూర్చుకుంది అల్ బాకెర్ గ్రూప్. ఢిల్లీ విమానాల లో ఇతర రాష్ట్రాలకు వెళ్లదలుచుకునేవారు సైతం ప్రయాణించవచ్చు. కాగా, విజయవాడ విమానం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితం. అలాగే చెన్నయ్ విమానం తమిళనాడు కు పరిమితం. హైద్రాబాద్ విమానం తెలంగాణ కు పరిమితం. కొచ్చిన్ విమానం మాత్రం కేరళతోపాటు తమిళనాడు కోసం కూడా వినియోగిస్తారు.
టికెట్ బుకింగ్ మరియు ఇతర వివరాల కోసం, ప్రజలు వీరిని సంప్రదించవచ్చు..
వసీమ్ - 99696767
యాసర్ - 67041981
సలీమ్ - 97122364
యూసఫ్ - 9667751
అతుల్ - 9731335
బిలాల్ - 99557046
లినెట్ - 99691151
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







