ఇండియాకి విమానాల పునఃప్రారంభంపై అల్ తాయెర్ గ్రూప్ ప్రకటన
- August 10, 2020
కువైట్: అల్ తాయెర్ గ్రూప్ మరియు లగ్జరీ ట్రావెల్స్, ఇండియాకి విమానాల్ని పునఃప్రారంభించే విషయమై ప్రకటన చేయడం జరిగింది. ఆగస్ట్ 11 నుంచి విమానాల పునరుద్ధరణ ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని గ్రూప్ సీఈఓ ఫహాద్ అల్ బాకర్ వెల్లడించారు. ఢిల్లీ, విజయవాడ, చెన్నయ్, ముంబై, హైద్రాబాద్ మరియు కొచ్చిన్లకు విమానాల్ని పునఃప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ గ్రూప్ నుంచి కువైట్ ఎయిర్వేస్ విమానాల్ని ఈ డెస్టినేషన్స్కి ఆఫర్ చేస్తున్నట్లు వివరించారు. ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్షలు చేసే సౌకర్యాన్ని కూడా సమకూర్చుకుంది అల్ బాకెర్ గ్రూప్. ఢిల్లీ విమానాల లో ఇతర రాష్ట్రాలకు వెళ్లదలుచుకునేవారు సైతం ప్రయాణించవచ్చు. కాగా, విజయవాడ విమానం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితం. అలాగే చెన్నయ్ విమానం తమిళనాడు కు పరిమితం. హైద్రాబాద్ విమానం తెలంగాణ కు పరిమితం. కొచ్చిన్ విమానం మాత్రం కేరళతోపాటు తమిళనాడు కోసం కూడా వినియోగిస్తారు.
టికెట్ బుకింగ్ మరియు ఇతర వివరాల కోసం, ప్రజలు వీరిని సంప్రదించవచ్చు..
వసీమ్ - 99696767
యాసర్ - 67041981
సలీమ్ - 97122364
యూసఫ్ - 9667751
అతుల్ - 9731335
బిలాల్ - 99557046
లినెట్ - 99691151
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







