కూటీ కోసం...కూలి కోసం దేశం విడిచిన బడుగు జీవికి ఎంత కష్టం ??
- February 06, 2016
జీవనం కోసం దేశం విడిచి...కుటుంబాలను వదలి వచ్చిన పేద కార్మికులు దుబాయ్ లో దర్జాగా ఉన్నారని అందరూ
భావిస్తారు. వీరు ఎంతో ప్రమాదకరమైన వృత్తులు చేస్తున్నారనే సంగతి ఎక్కడో ఉన్నవారి కుటుంబసభ్యులకు ఏ మాత్రం తెలియదు...తాము మైనం మాదిరిగా కరిగిపోతూ తమ వళ్ళు చల్లగా సుఖంగా ఉండాలని వీరు నిత్యం భగవంతుడ్ని కోరుకుంటారు. ఎంతో హృదయవిధారకరమైన వీరి జీవనశైలి గూర్చితెలుసుకొనేందుకు " మా గల్ఫ్ డాట్ కామ్ " వారిని ఎలా ఉన్నారని పలకరించింది. బంగ్లాదేశ్ కు చెందిన అలీ హుస్సిన్ (35) ఎత్తైన భవనాలపై కిటికీలను శుబ్రం చేసే కార్మికుడు జవాబిస్తూ , ప్రస్తుతం తాను 40 అంతస్థుల భవనంను శుబ్రం చేసానని...ఇందుకు 30 రోజుల సమయం పట్టిందని, అలాగే మరో 14 అంతస్థుల భవనం పని ఉందని..ఆ పనిని 10 - 12 రోజుల వ్యవధిలో పూర్తి చేస్తానని చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో జవాబు ఇచ్చాడు. గత 7 ఏళ్ళుగా దుబాయ్ లో ఇదే వృత్తిలో కొనసాగుతున్నట్లు తెలిపాడు. బాగా ఎత్తైన భవనాల పై గాల్లో వేలాడుతూ పని చేయాల్సిందేనని, ఒకసారి పట్టు జారితే...తమ శరీర భాగాలు చిద్రమై అనవాళ్ళుకు సైతం దొరకవని పేర్కొన్నాడు. ఎత్తైన కిటికీల మీద నిలబడి పని చేస్తుంటే.., భయం కలగదా అని అలీని అడిగితే, తనకు అటువంటి భయాలు ఉండవని బదులిచ్చాడు. మీరు చేస్తున్న ఈ ప్రమాదకరమైన కష్టం గూర్చి మీ కుటుంబ సభ్య్హులకు తెలుసా అని అడిగితే, తనని వెంటనే వచ్చేయమని గగ్గోలు పెడతారని అలీ నవ్వుతూ చెప్పాడు. అతని సహావృత్తి కార్మికుడు నేపాల్ కు చెందిన జోగ్గ్రం చౌదరి మాట్లాడుతూ , తన భార్యకు తాను చేస్తున్న పని గూర్చి ఏ మాత్రం తెలియదని...ఇలా ఎత్తుగా ఉన్న భవనాల అంచులపై గాల్లో వేలాడుతూ పని చేయడం అని చెబితే , ఎంతో భయపడి ..తనను వెంటనే ఇంటికీ రమ్మని సతాయిస్తుందని పెద్దగా నవ్వుతూ చెప్పాడు. దుబాయ్ అంటే మీకు ఇష్టమా ? అని ప్రశ్నిస్తే...అవును చాలా ఇష్టమని కళ్ళు కిందకు దించి..రాలి పడే కన్నీటి బిందువులను దాచే యత్నం చేశాడు అలీ.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









