తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు
- August 11, 2020
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 82,647కు చేరింది. తాజాగా 8 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 645కి పెరిగింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22,628 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 59,374 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే తెలంగాణలో కరోనా రికవరీ రేటు 71.84 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,42,875 నమూనాలు పరీక్షించినట్లు వివరించింది. అయితే సోమవారం అత్యధికంగా GHMC పరిధిలోనే 338 కేసులు నమోదుకాగా.. రంగారెడ్డి జిల్లాలో 147, కరీంనగర్ జిల్లాలో 121, మేడ్చల్ జిల్లాలో 119 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
--హరి(మాగల్ఫ్ ప్రతినిథి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన