తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు
- August 11, 2020
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 82,647కు చేరింది. తాజాగా 8 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 645కి పెరిగింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22,628 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 59,374 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే తెలంగాణలో కరోనా రికవరీ రేటు 71.84 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,42,875 నమూనాలు పరీక్షించినట్లు వివరించింది. అయితే సోమవారం అత్యధికంగా GHMC పరిధిలోనే 338 కేసులు నమోదుకాగా.. రంగారెడ్డి జిల్లాలో 147, కరీంనగర్ జిల్లాలో 121, మేడ్చల్ జిల్లాలో 119 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
--హరి(మాగల్ఫ్ ప్రతినిథి,తెలంగాణ)

తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







