తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు
- August 11, 2020
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 82,647కు చేరింది. తాజాగా 8 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 645కి పెరిగింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22,628 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 59,374 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే తెలంగాణలో కరోనా రికవరీ రేటు 71.84 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,42,875 నమూనాలు పరీక్షించినట్లు వివరించింది. అయితే సోమవారం అత్యధికంగా GHMC పరిధిలోనే 338 కేసులు నమోదుకాగా.. రంగారెడ్డి జిల్లాలో 147, కరీంనగర్ జిల్లాలో 121, మేడ్చల్ జిల్లాలో 119 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
--హరి(మాగల్ఫ్ ప్రతినిథి,తెలంగాణ)

తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









