తెలంగాణలో కొత్తగా 1,931 కరోనా కేసులు నమోదు

- August 13, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 1,931 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంలేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,931 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 86,475కి చేరింది. ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 665కి చేరాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 63,074మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 22,736 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 72.93 శాతంగా నమోదైంది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com