డ్రగ్స్ ముఠా ఆట కట్టించిన సౌదీ పోలీసులు..107 కిలోల మత్తుపదార్ధాల స్వాధీనం
- August 13, 2020
రియాద్:సౌదీలో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు జాసన్ పోలీసులు. ఓ వాహనంలో తరలిస్తున్న మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలోని ట్రంక్ ప్రాంతంలో నిషేధిత హషిష్ ను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు స్మగ్లర్లు కుట్ర చేశారు. అయితే..వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు..డ్రగ్స్ తరలిస్తున్న వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించటంతో అసలు బాగోతం బయటపడింది. ఏకంగా 107 కేజీల నిషేధిత హషిష్ ను గుర్తించిన పోలీసులు..మత్తు పదార్ధాలను సీజ్ చేశారు. సౌదీ చెందిన వ్యక్తి వాహనం నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న తీరును బట్టి ఇది పక్కా స్మగ్లింగ్ గ్యాంగ్ పనే అని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. సౌదీ చట్టాల మేరకు మత్తుపదార్ధాలు సరఫరాపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







