డ్రగ్స్ ముఠా ఆట కట్టించిన సౌదీ పోలీసులు..107 కిలోల మత్తుపదార్ధాల స్వాధీనం

- August 13, 2020 , by Maagulf
డ్రగ్స్ ముఠా ఆట కట్టించిన సౌదీ పోలీసులు..107 కిలోల మత్తుపదార్ధాల స్వాధీనం

రియాద్:సౌదీలో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు జాసన్ పోలీసులు. ఓ వాహనంలో తరలిస్తున్న మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలోని ట్రంక్ ప్రాంతంలో నిషేధిత హషిష్ ను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు స్మగ్లర్లు కుట్ర చేశారు. అయితే..వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు..డ్రగ్స్ తరలిస్తున్న వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించటంతో అసలు బాగోతం బయటపడింది. ఏకంగా 107 కేజీల నిషేధిత హషిష్ ను గుర్తించిన పోలీసులు..మత్తు పదార్ధాలను సీజ్ చేశారు. సౌదీ చెందిన వ్యక్తి వాహనం నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న తీరును బట్టి ఇది పక్కా స్మగ్లింగ్ గ్యాంగ్ పనే అని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. సౌదీ చట్టాల మేరకు మత్తుపదార్ధాలు సరఫరాపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com