డ్రగ్స్ ముఠా ఆట కట్టించిన సౌదీ పోలీసులు..107 కిలోల మత్తుపదార్ధాల స్వాధీనం
- August 13, 2020
రియాద్:సౌదీలో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు జాసన్ పోలీసులు. ఓ వాహనంలో తరలిస్తున్న మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలోని ట్రంక్ ప్రాంతంలో నిషేధిత హషిష్ ను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు స్మగ్లర్లు కుట్ర చేశారు. అయితే..వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు..డ్రగ్స్ తరలిస్తున్న వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించటంతో అసలు బాగోతం బయటపడింది. ఏకంగా 107 కేజీల నిషేధిత హషిష్ ను గుర్తించిన పోలీసులు..మత్తు పదార్ధాలను సీజ్ చేశారు. సౌదీ చెందిన వ్యక్తి వాహనం నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న తీరును బట్టి ఇది పక్కా స్మగ్లింగ్ గ్యాంగ్ పనే అని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. సౌదీ చట్టాల మేరకు మత్తుపదార్ధాలు సరఫరాపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







