అకామడేషన్స్లో తనిఖీలు కొనసాగుతాయ్
- August 14, 2020మనామా:సదరన్ గవర్నరేట్, లేబర్ అకామడేషన్లలో తనిఖీల్ని కొనసాగించనున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఎప్పటికప్పుడు విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలి బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గవర్నరేట్కి చెందిన ఇంజనీరింగ్ సర్వీసెస్ అలాగే ఇన్వెస్టిమెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇంజనీర్ ఖాలిద్ అబ్దుల్లతీఫ్ హాజి నేతృత్వంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, సదరన్ ఏరియా మునిసిపాలిటీ అలాగే ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ సంయుక్తంగా ఈ తనిఖీల్ని నిర్వహించడం జరుగుతోంది. హాజి వెల్లడించిన వివరాల ప్రకారం 16 యూనిట్లను ఇప్పటికే తనిఖీలు చేశారు. ఉల్లంఘనులపై చర్యలు కూడా తీసుకున్నారు. క్రౌడ్ హౌసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు హాజి వివరించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్