మస్కట్:క్రూజ్‌ బోట్‌లో అగ్ని ప్రమాదం

- August 14, 2020 , by Maagulf
మస్కట్:క్రూజ్‌ బోట్‌లో అగ్ని ప్రమాదం

మస్కట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ (పిఎసిడిఎ), మస్కట్‌ గవర్నరేట్‌లో ఓ క్రూజ్‌ బోట్‌ అగ్ని ప్రమాదానికి గురికాగా, సకాలంలో స్పందించి మంటల్ని అదుపు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ పిఎసిడిఎ ఓ ప్రకటన విడుదల చేసింది. విలాయత్‌ ఆప్‌ సీబ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వారికి అత్యవసర వైద్యం అందించి, ఆసుపత్రికి తరలించారు. బోట్‌ ఓనర్లు అప్రమత్తంగా వుండాలనీ, రెగ్యులర్‌ మెయిన్‌టెనెన్స్‌ తప్పనిసరి అనీ బోటు యజమానులకు సూచించినట్లు అథారిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com