దోహా:షెడ్యూల్ కంటే ముందే దుహైల్- అల్ ఘర్రఫా బ్రిడ్జిని ప్రారంభించిన అష్ఘల్

- August 16, 2020 , by Maagulf
దోహా:షెడ్యూల్ కంటే ముందే దుహైల్- అల్ ఘర్రఫా బ్రిడ్జిని ప్రారంభించిన అష్ఘల్

దోహా:ఖతార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సబా అల్ అహ్మద్ కారిడార్ లో భాగంగా చేపట్టిన దుహైల్ -అల్ ఘర్రఫా బ్రిడ్జిని ప్రజా పనుల అధికార విభాగం అష్ఘల్ ప్రారంభించింది. అయితే..ముందుగా నిర్ణయించిన గడువు కంటే ఆరు నెలలు ముందుగానే పనులను పూర్తి చేసి బ్రిడ్జిని ప్రారంభించటం విశేషం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో దుహైల్-అల్ ఘర్రఫా మధ్య వాహనాల రాకపోకలకు మరింత సులభతరం కానుంది. అలాగే వివిధ ప్రాంతాల అనుసంధానం మరింత మెరుగు పడనుంది. అయితే..కరోనా నేపథ్యంలో నెలకొన్న అవాంతరాలను దాటుకొని కూడా బ్రిడ్జి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసుకొని అనుకున్న షెడ్యూల్ కంటే ఆరు నెలలు ముందు వాహనదారులకు అందుబాటులో తీసుకురావటం పట్ల గర్వ పడుతున్నట్లు అష్ఘల్ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com