దోహా:షెడ్యూల్ కంటే ముందే దుహైల్- అల్ ఘర్రఫా బ్రిడ్జిని ప్రారంభించిన అష్ఘల్
- August 16, 2020
దోహా:ఖతార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సబా అల్ అహ్మద్ కారిడార్ లో భాగంగా చేపట్టిన దుహైల్ -అల్ ఘర్రఫా బ్రిడ్జిని ప్రజా పనుల అధికార విభాగం అష్ఘల్ ప్రారంభించింది. అయితే..ముందుగా నిర్ణయించిన గడువు కంటే ఆరు నెలలు ముందుగానే పనులను పూర్తి చేసి బ్రిడ్జిని ప్రారంభించటం విశేషం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో దుహైల్-అల్ ఘర్రఫా మధ్య వాహనాల రాకపోకలకు మరింత సులభతరం కానుంది. అలాగే వివిధ ప్రాంతాల అనుసంధానం మరింత మెరుగు పడనుంది. అయితే..కరోనా నేపథ్యంలో నెలకొన్న అవాంతరాలను దాటుకొని కూడా బ్రిడ్జి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసుకొని అనుకున్న షెడ్యూల్ కంటే ఆరు నెలలు ముందు వాహనదారులకు అందుబాటులో తీసుకురావటం పట్ల గర్వ పడుతున్నట్లు అష్ఘల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యాదగిరిగుట్టలో అతిపెద్ద వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్
- భారత్ కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
- యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల..
- భారతదేశానికి మరో అంతర్జాతీయ గౌరవం
- లాయర్ ఖాజా మొయినుద్దీన్ను కారుతో తొక్కించి హత్య!
- యూఏఈలో ఉద్యోగం మారుతున్నారా?బ్యాన్ పడకుండా ఉండాలంటే ఈ రూల్స్ తెలుసుకోండి!
- భారతదేశంలోనే పొడవైన నాన్స్టాప్ రూట్ కలిగిన టాప్-2 రైళ్లు ఇవే!
- విమానాల్లో యూఏఈకి వస్తున్న భారతీయ మేకలు..ధరలు 800 దిర్హాముల నుండి ప్రారంభం!
- రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్: సీపీ విసి సజ్జనార్









