సంపత్నంది కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్తో కె.కె.రాధామోహన్ కొత్త చిత్రం
- August 17, 2020
హైదరాబాద్:ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంబించారు. ఈ చిత్రం గురించి నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ``మా బ్యానర్లో ఏమైంది ఈవేళ, బెంగాల్టైగర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు సంపత్నంది చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా అనిపించింది. కథ బాగా నచ్చడంతో ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ ఫస్ట్వీక్ నుండి నాన్స్టాప్గా షూటింగ్ జరుగుతుంది. సంపత్నంది అసోసియేట్ డైరెక్టర్ అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించి ప్రముఖ నటీనటుల ఎంపిక జరుగుతుంది. అనూప్ క్రియేటివ్స్ సంగీతం అందిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ప్రవీణ్ అనుమోలు,
సంగీతం: అనూప్ క్రియేటివ్స్,
సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్,
నిర్మాత: కె.కె. రాధామోహన్,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సంపత్నంది,
దర్శకత్వం: అశోక్ తేజ.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల