తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
- August 17, 2020
విశాఖపట్నం:వర్షం ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు అధికారులు ప్రకటించారు. చత్తీస్గడ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి చెదురు మదరుగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ప్రకటించారు. అలాగే ఈనెల 19న ఉత్తర బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
ఇదిలాఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. కొన్ని ప్రాజెక్టులకు వరద పోటు ఎక్కువగా ఉండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







