వినాయక చవితి ఉత్సవాలపై తెలంగాణ ప్రభత్వం కీలక నిర్ణయం
- August 17, 2020
హైదరాబాద్: గణేష్ ఉత్సవ మండపాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలోఈ వినాయకచవితికి ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెహర్రం, వినాయకచవితి కార్యక్రమాలు బహిరంగ ప్రదేశాల్లో జరగనివ్వమని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. కరోనా నేపథ్యంలో వినాయక పూజలు నిరాడంబరంగా నిర్వహించాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.
మట్టి విగ్రహాలను తెచ్చుకుని పూజించాలని, 5 అడుగుల ఎత్తులోపు ఉండాలని పలు చోట్ల గణేష్ ఉత్సవ కమిటీలు ప్రజలకు పిలుపునిచ్చాయి. భారీ విగ్రహాలు, సెట్టింగ్లు ఏర్పాటు చేయవద్దని గణేష్ ఉత్సవ కమిటీలకు కూడా ఇప్పటికే ఆదేశాలు అందాయి. పూజలో అర్చకునితో పాటు ఒక జంట దంపతులు మాత్రమే కూర్చోవాలని గణేష్ ఉత్సవ కమిటీలు భక్తులకు సూచన చేశాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







