వినాయక చవితి ఉత్సవాలపై తెలంగాణ ప్రభత్వం కీలక నిర్ణయం

- August 17, 2020 , by Maagulf
వినాయక చవితి ఉత్సవాలపై తెలంగాణ ప్రభత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: గణేష్ ఉత్సవ మండపాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలోఈ వినాయకచవితికి ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెహర్రం, వినాయకచవితి కార్యక్రమాలు బహిరంగ ప్రదేశాల్లో జరగనివ్వమని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. కరోనా నేపథ్యంలో వినాయక పూజలు నిరాడంబరంగా నిర్వహించాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.

మట్టి విగ్రహాలను తెచ్చుకుని పూజించాలని, 5 అడుగుల ఎత్తులోపు ఉండాలని పలు చోట్ల గణేష్ ఉత్సవ కమిటీలు ప్రజలకు పిలుపునిచ్చాయి. భారీ విగ్రహాలు, సెట్టింగ్‌లు ఏర్పాటు చేయవద్దని గణేష్ ఉత్సవ కమిటీలకు కూడా ఇప్పటికే ఆదేశాలు అందాయి. పూజలో అర్చకునితో పాటు ఒక జంట దంపతులు మాత్రమే కూర్చోవాలని గణేష్ ఉత్సవ కమిటీలు భక్తులకు సూచన చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com