కరోనా బాధితులకు ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించిన సీపీ మహేష్భగవత్
- August 18, 2020
హైదరాబాద్: కరోనా బారినపడిన వారిని ఇంటి నుంచి ఆసుపత్రికి తరలించడానికి ఉచిత అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయక్తంగా ఉంటాయని రాచకొండ పోలీస్ కమీషనర్
మహేష్ భగవత్ అన్నారు. కరోనాతో లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అంబులెన్స్లో ఆసుపత్రికి ఉచితంగా చేరడానికి కమిషనరేట్లో లైఫ్లైన్ సేవల్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఇందు కోసం ఏర్పాటు చేసిన రెండు అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో డబ్బులు చెల్లించలేని వారికి కోసం, అనారోగ్యంతో లేదా వయసురీత్యా కాలు బయట పెట్టలేని వారి కోసం ఇవి చాలా ఉపయోగపడతాయన్నారు. కమిషనరేట్ నుంచి 24గంటలు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అవసరమున్న వారు ఫోన్ 94906 17234, 94906 17111లో సంప్రదించాలన్నారు.



తాజా వార్తలు
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త









