యూఏఈ నుంచి విమాన ప్రయాణానికి కోవిడ్-19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి
- August 18, 2020
యూఏఈ:యూఏఈ వచ్చేందుకే కాదు..యూఏఈ నుంచి విమాన ప్రయాణం చేయాలన్నా ఇక నుంచి కోవిడ్ 19 పీసీఆర్ నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ మేరకు యూఏఈలోని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి సర్వీసులు అందిస్తున్న విమానయాన సంస్థలకు నోటీసులు అందాయి. ఇక నుంచి షార్జా, అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడు చెక్ ఇన్ కౌంటర్ దగ్గర కోవిడ్ 19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ ను విధిగా చూపించాల్సి ఉంటుంది. విమానం బయల్దేరే సమయానికి 48 గంటల లోపు తీసుకున్న రిపోర్ట్ ను మాత్రమే అనుమతిస్తారు. షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్వీసులు నడిపించే విమానయాన సంస్థలకు షార్జా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఈ మేరకు సమాచారం అందించింది. అలాగే అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు కూడా రెండు విమానయాన సంస్థలకు కోవిడ్ 19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అని తెలుపుతూ సమాచారం అందించింది. దీంతో యూఏఈ పౌర విమానయాన సంస్థ ఎతిహాద్ గత బుధవారమే తమ ప్రయాణికులకు ఆర్టీ పీపీఆర్ టెస్ట్ ఫలితాలకు సంబంధించి సమాచారం అందించింది. తమ సర్వీసుల్లో ప్రయాణం చేయాలంటే ప్రయాణ సమయానికి 96 గంటల్లో తీసుకున్న కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ కాపీ ఖచ్చితంగా చూపించాలని ప్రయాణికులను కోరింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







