యూఏఈ నుంచి విమాన ప్రయాణానికి కోవిడ్-19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి
- August 18, 2020
యూఏఈ:యూఏఈ వచ్చేందుకే కాదు..యూఏఈ నుంచి విమాన ప్రయాణం చేయాలన్నా ఇక నుంచి కోవిడ్ 19 పీసీఆర్ నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ మేరకు యూఏఈలోని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి సర్వీసులు అందిస్తున్న విమానయాన సంస్థలకు నోటీసులు అందాయి. ఇక నుంచి షార్జా, అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడు చెక్ ఇన్ కౌంటర్ దగ్గర కోవిడ్ 19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ ను విధిగా చూపించాల్సి ఉంటుంది. విమానం బయల్దేరే సమయానికి 48 గంటల లోపు తీసుకున్న రిపోర్ట్ ను మాత్రమే అనుమతిస్తారు. షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్వీసులు నడిపించే విమానయాన సంస్థలకు షార్జా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఈ మేరకు సమాచారం అందించింది. అలాగే అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు కూడా రెండు విమానయాన సంస్థలకు కోవిడ్ 19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అని తెలుపుతూ సమాచారం అందించింది. దీంతో యూఏఈ పౌర విమానయాన సంస్థ ఎతిహాద్ గత బుధవారమే తమ ప్రయాణికులకు ఆర్టీ పీపీఆర్ టెస్ట్ ఫలితాలకు సంబంధించి సమాచారం అందించింది. తమ సర్వీసుల్లో ప్రయాణం చేయాలంటే ప్రయాణ సమయానికి 96 గంటల్లో తీసుకున్న కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ కాపీ ఖచ్చితంగా చూపించాలని ప్రయాణికులను కోరింది.
తాజా వార్తలు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం









