శంషాబాద్: అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- August 18, 2020
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి విజృంభించడంతో విమాన సర్వీసులు పూర్తిగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత్, యూకే మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు వారానికి నాలుగు విమాన సర్వీసులు నడవనున్నట్టు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్లోని హీత్రూ విమానాశ్రయానికి బ్రిటీష్ ఎయిర్వేస్ బీఏ 276 బోయింగ్ 787 డీమ్లైనర్ విమానం బయలుదేరి వెళ్లిందని చెప్పారు. ప్రతి సోమ, బుధ, శుక్ర,
ఆదివారాల్లో ఈ విమాన సర్వీసులు నడుస్తాయని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
--శ్రీనివాస్ మంచర్ల (మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







