శంషాబాద్: అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- August 18, 2020
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి విజృంభించడంతో విమాన సర్వీసులు పూర్తిగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత్, యూకే మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు వారానికి నాలుగు విమాన సర్వీసులు నడవనున్నట్టు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్లోని హీత్రూ విమానాశ్రయానికి బ్రిటీష్ ఎయిర్వేస్ బీఏ 276 బోయింగ్ 787 డీమ్లైనర్ విమానం బయలుదేరి వెళ్లిందని చెప్పారు. ప్రతి సోమ, బుధ, శుక్ర,
ఆదివారాల్లో ఈ విమాన సర్వీసులు నడుస్తాయని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
--శ్రీనివాస్ మంచర్ల (మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!









