గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- September 12, 2025
యూఏఈ: యూఏఈలో ఉన్న ప్రవాసుల కోసం బంగారం తీసుకెళ్లే నియమాలను స్పష్టం చేయాలని యూఏఈకి చెందిన ఒక సంస్థ భారత ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థనను దాఖలు చేసింది. ప్రస్తుత బంగారం ధరలకు అనుగుణంగా కస్టమ్స్ సామాను డిక్లరేషన్ నిబంధనలలోని అస్పష్టతలను తొలగించాలని కోరుతూ షార్జా ఇండియన్ అసోసియేషన్ భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఒక మెమోరాండం పంపింది. విమానాశ్రయాలలో ప్రయాణించేటప్పుడు భారతీయ ప్రవాసులు ఎదుర్కొనే భారీ సమస్య ఇదని సంస్థ అధ్యక్షుడు నిజార్ తలంగర అన్నారు.
ఇటీవల తన ఇండియా పర్యటనలో 30 గ్రాముల బరువున్న రెండు బంగారు గాజులను తీసుకెళ్లినందుకు భారత విమానాశ్రయంలో ఒక గంటకు పైగా తనను ఎలా “వేధించారో” సంస్థ ఉపాధ్యక్షుడు ప్రతీప్ నెమ్మర వివరించారు. బంగారంపై 35 శాతం పన్ను చెల్లించమని అధికారులు అడిగారు.
"ఒక ప్రవాస వ్యక్తి ఇంటికి ఎంత బంగారం తీసుకెళ్లవచ్చో నియంత్రించే చట్టం దాదాపు దశాబ్దం క్రితం రూపొందించారు. ప్రస్తుత వాస్తవాలను అవి ప్రతిబింబించవు. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న సమయంలో ఈ పాత విలువ కారణంగా చాలా మంది ప్రవాస ప్రయాణికులు ట్యాక్స్ కింద భారీ మొత్తాలను చెల్లించాల్సి వస్తోంది." అని లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. విదేశాల నుండి భారతదేశానికి ప్రయాణించేటప్పుడు మహిళలు రూ.100,000 (సుమారు దిర్హామ్లు 4,200) విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలను, పురుషులు రూ.50,000 (దిర్హామ్లు 2,100) విలువ గల 20 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకెళ్లవచ్చు.
2016లో బంగారం తీసుకెళ్లే నియమాల నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో 22K బంగారం ధర దాదాపు Rs2,500 (Dh104) అని మెమోరాండంలో పేర్కొన్నారు. అయితే, బంగారం ధరలు ఇప్పుడు మూడు రెట్లు పెరిగి Dh400 కంటే ఎక్కువగా ఉన్నాయి. దీని అర్థం ఇప్పుడు 40 గ్రాముల బంగారం విలువ 16,000 దిర్హామ్లకు పైగా ఉంది. 20 గ్రాముల 22 కే బంగారం విలువ 8,000 దిర్హామ్లకు పైగా ఉంది. ఈ వ్యత్యాసం ప్రయాణీకులకు గందరగోళాన్ని సృష్టిస్తుంది. అమలులో అధికారులకు ఇబ్బందులను కలిగిస్తుందని భారత కమ్యూనిటీ వివరించింది. అన్ని తాజా వివరాలను పరిగణనలోకి తీసుకొని నోటిఫికేషన్లోని బంగారం విలువ పరిమితిని తొలగించాలని, ప్రయాణీకులకు నిర్దిష్ట బరువు బంగారు ఆభరణాలను అనుమతించాలని మెమోలో అభ్యర్థించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









