అనుష్క 'నిశ్శబ్దం' ఓటీటీలోనే!
- August 19, 2020
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఐదు నెలలుగా సినిమా హాళ్లు మూతపడిన సంగతి తెల్సిందే. దీంతో ఒక్కొక్కటిగా సినిమాలు ఓటీటీ నెట్వర్క్ లో విడుదల అవుతున్నాయి. ఇటీవల నాని నటించిన 'వి' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుందని సమాచారం వచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన 'నిశ్శబ్దం' సినిమా కూడా ఓటీటీ ద్వారా విడుదల కాబోతుంది. ఈ సినిమాను ఎప్పుడో ఓటీటీ ద్వారా విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నించినా, అనుష్క అభ్యంతరం చెప్పింది. దీంతో ఇన్ని రోజులు విడుదలకు నోచుకోలేదు. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ తో అప్పుడే డీల్ కూడా ఓకే అయ్యిందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఎక్కడ రిలీజ్ చేయాలని కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నిర్మాత కోన వెంకట్ ఓ ఆన్ లైన్ పోల్ నిర్వహించారు. అందులో 56 శాతం మంది ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటున్నామని తెలిపారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. మాధవన్, అంజలి, శ్రీనివాస అవసరాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను కోన వెంకట్, టీజీ విశ్వా ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







