అనుష్క 'నిశ్శబ్దం' ఓటీటీలోనే!
- August 19, 2020
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఐదు నెలలుగా సినిమా హాళ్లు మూతపడిన సంగతి తెల్సిందే. దీంతో ఒక్కొక్కటిగా సినిమాలు ఓటీటీ నెట్వర్క్ లో విడుదల అవుతున్నాయి. ఇటీవల నాని నటించిన 'వి' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుందని సమాచారం వచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన 'నిశ్శబ్దం' సినిమా కూడా ఓటీటీ ద్వారా విడుదల కాబోతుంది. ఈ సినిమాను ఎప్పుడో ఓటీటీ ద్వారా విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నించినా, అనుష్క అభ్యంతరం చెప్పింది. దీంతో ఇన్ని రోజులు విడుదలకు నోచుకోలేదు. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ తో అప్పుడే డీల్ కూడా ఓకే అయ్యిందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఎక్కడ రిలీజ్ చేయాలని కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నిర్మాత కోన వెంకట్ ఓ ఆన్ లైన్ పోల్ నిర్వహించారు. అందులో 56 శాతం మంది ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటున్నామని తెలిపారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. మాధవన్, అంజలి, శ్రీనివాస అవసరాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను కోన వెంకట్, టీజీ విశ్వా ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









