అనుష్క 'నిశ్శబ్దం' ఓటీటీలోనే!
- August 19, 2020
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఐదు నెలలుగా సినిమా హాళ్లు మూతపడిన సంగతి తెల్సిందే. దీంతో ఒక్కొక్కటిగా సినిమాలు ఓటీటీ నెట్వర్క్ లో విడుదల అవుతున్నాయి. ఇటీవల నాని నటించిన 'వి' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుందని సమాచారం వచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన 'నిశ్శబ్దం' సినిమా కూడా ఓటీటీ ద్వారా విడుదల కాబోతుంది. ఈ సినిమాను ఎప్పుడో ఓటీటీ ద్వారా విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నించినా, అనుష్క అభ్యంతరం చెప్పింది. దీంతో ఇన్ని రోజులు విడుదలకు నోచుకోలేదు. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ తో అప్పుడే డీల్ కూడా ఓకే అయ్యిందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఎక్కడ రిలీజ్ చేయాలని కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నిర్మాత కోన వెంకట్ ఓ ఆన్ లైన్ పోల్ నిర్వహించారు. అందులో 56 శాతం మంది ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటున్నామని తెలిపారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. మాధవన్, అంజలి, శ్రీనివాస అవసరాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను కోన వెంకట్, టీజీ విశ్వా ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







