తెలంగాణలో కొత్తగా 1,724 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- August 20, 2020
హైదరాబాద్:తెలంగాణలో గత 24 గంటల్లో 23,841 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1724 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 97,424కు చేరింది. ఈ మేరకు గురువారం ఉదయం వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా కరోనా వైరస్తో కొత్తగా 10 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 729కు పెరిగింది. కాగా బుధవారం కొత్తగా 1195 మంది కోలుకోని ఆసుపత్రుల నుంచి డిశ్చార్చి అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి మొత్తం సంఖ్య 75,186కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,509యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 8,21,311మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. తెలంగాణలో రికవరీ రేటు 77.17శాతం ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







