మనీలాండరింగ్ రాకెట్ని భగ్నం చేసిన సౌదీ పోలీస్
- August 20, 2020
రియాద్: రియాద్ పోలీస్, ఎనిమిది మంది సభ్యులుగల ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. విదేశాలకు డబ్బుని అక్రమంగా తరలిస్తున్నట్లు ఈ ముఠాపై అభియోగాలు మోపబడ్డాయి. ముగ్గురు సౌదీలు, ఐదుగురు సుడానీలు ఈ గ్యాంగ్లో వున్నారు. 500 మిలియన్ రియాల్స్కి పైగా డబ్బుని అక్రమంగా విదేశాలకు నిందితులు ట్రాన్స్ఫర్ చేసినట్లు రియాద్ పోలీస్ అసిస్టెంట్ స్పోక్పర్సన్ మేజర్ ఖాలెద్ అల్ క్రెదిస్ చెప్పారు. ఈ ముఠా గురించి సమాచారం అందడంతో, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ని ప్రారంభించి, నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి రిఫర్ చేయడం జరిగింది. వీరిపై మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!