మనీలాండరింగ్ రాకెట్ని భగ్నం చేసిన సౌదీ పోలీస్
- August 20, 2020
రియాద్: రియాద్ పోలీస్, ఎనిమిది మంది సభ్యులుగల ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. విదేశాలకు డబ్బుని అక్రమంగా తరలిస్తున్నట్లు ఈ ముఠాపై అభియోగాలు మోపబడ్డాయి. ముగ్గురు సౌదీలు, ఐదుగురు సుడానీలు ఈ గ్యాంగ్లో వున్నారు. 500 మిలియన్ రియాల్స్కి పైగా డబ్బుని అక్రమంగా విదేశాలకు నిందితులు ట్రాన్స్ఫర్ చేసినట్లు రియాద్ పోలీస్ అసిస్టెంట్ స్పోక్పర్సన్ మేజర్ ఖాలెద్ అల్ క్రెదిస్ చెప్పారు. ఈ ముఠా గురించి సమాచారం అందడంతో, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ని ప్రారంభించి, నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి రిఫర్ చేయడం జరిగింది. వీరిపై మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







