యూఏఈ రెసిడెంట్స్కి తాజా హెచ్చరిక
- August 20, 2020
యూఏఈ:‘లీగల్ నోటిఫికేషన్’ పేరుతో వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా వేదికలపై సర్క్యులేట్ అవుతోన్న ఓ ఫేక్ నోటిఫికేషన్పై రెసిడెంట్స్ని అప్రమత్తం చేస్తున్నాయి సంబంధిత అథారిటీస్. ‘మీ బ్యాంక్ అకౌంట్ భద్రతా కారణాల రీత్యా ఫ్రీజ్ చేయబడింది. మీ పూర్తి వివరాలు వెరిఫై చేసుకోండి. లేని పక్షంలో అకౌంట్ శాశ్వతంగా సస్పెండ్ అవుతుంది’ అంటూ ఆ సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 24 గంటల్లోగా ఫోన్ చేయాలంటూ ఓ ఫోన్ నెంబర్ కూడా అందులో పొందుపరుస్తున్నారు స్కామర్స్. ఈ నేపథ్యంలో యూఏఈ సెంట్రల్ బ్యాంక్, ఇతర బ్యాంకులు తమ వినియోగదారుల్ని పలుమార్లు ఇదే విషయమై అప్రమత్తం చేయడం జరిగింది. వినియోగదారులెవరూ ఇలాంటి మెసేజ్ల పట్ల ఆకర్షితులవ్వొద్దనీ, ఆందోళన చెందవద్దనీ, వాటిని అసలు పట్టించుకోవద్దని సూచిస్తున్నారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!