యూఏఈ రెసిడెంట్స్‌కి తాజా హెచ్చరిక

- August 20, 2020 , by Maagulf
యూఏఈ రెసిడెంట్స్‌కి తాజా హెచ్చరిక

యూఏఈ:‘లీగల్‌ నోటిఫికేషన్‌’ పేరుతో వాట్సాప్‌ మరియు ఇతర సోషల్‌ మీడియా వేదికలపై సర్క్యులేట్‌ అవుతోన్న ఓ ఫేక్‌ నోటిఫికేషన్‌పై రెసిడెంట్స్‌ని అప్రమత్తం చేస్తున్నాయి సంబంధిత అథారిటీస్‌. ‘మీ బ్యాంక్‌ అకౌంట్‌ భద్రతా కారణాల రీత్యా ఫ్రీజ్‌ చేయబడింది. మీ పూర్తి వివరాలు వెరిఫై చేసుకోండి. లేని పక్షంలో అకౌంట్‌ శాశ్వతంగా సస్పెండ్‌ అవుతుంది’ అంటూ ఆ సందేశం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 24 గంటల్లోగా ఫోన్‌ చేయాలంటూ ఓ ఫోన్‌ నెంబర్‌ కూడా అందులో పొందుపరుస్తున్నారు స్కామర్స్‌. ఈ నేపథ్యంలో యూఏఈ సెంట్రల్‌ బ్యాంక్‌, ఇతర బ్యాంకులు తమ వినియోగదారుల్ని పలుమార్లు ఇదే విషయమై అప్రమత్తం చేయడం జరిగింది. వినియోగదారులెవరూ ఇలాంటి మెసేజ్‌ల పట్ల ఆకర్షితులవ్వొద్దనీ, ఆందోళన చెందవద్దనీ, వాటిని అసలు పట్టించుకోవద్దని సూచిస్తున్నారు.

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com