భారత రాయబారి ని కలిసిన APNRTS కువైట్ సమన్వయకర్తల బృందం

- August 20, 2020 , by Maagulf
భారత రాయబారి ని కలిసిన APNRTS కువైట్ సమన్వయకర్తల బృందం

కువైట్ సిటీ:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ తరుపున,మరియు ఏపిఎన్ఆర్టీఎస్ కువైట్ సమన్వయకర్తల బృందం తరుపున ముమ్మడి బాలిరెడ్డి కూవైట్ లో భారత ప్రభుత్వం తరపున నియమితులైన నూతన రాయబారి సెబి జార్జ్ ని బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కువైట్‌ లోని భారత రాయబార కార్యాలయంలో  భారత రాయబారి ఆధ్వర్యాన జరిగిన తొలి సమావేశం ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముమ్మడి బాలిరెడ్డి బృందం కువైట్ లో ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న,ముఖ్యమైన సమస్యలను రాయబారికి వివరించారు.సమస్యల పై రాయబారి సానుకూలంగా స్పందించారు. 

భారత రాయబారిని కలిసిన వారిలో ముమ్మడి బాలిరెడ్డి,నాయని మహేశ్వర్ రెడ్డి,షేక్ గఫార్,నాగిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి,అబు తురాబ్,పిడుగు సుబ్బా రెడ్డి,పోలూరు ప్రభాకర్ ఆకుల చలపతి, మురళి రాయల్ తదితరులున్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com