ఒమన్ లో నిజామాబాద్ జిల్లా వాసి మృతి
- August 23, 2020
మస్కట్: ఒమన్ లో నిజామాబాద్ జిల్లా వాసి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మాలవత్ పాండ్యా(33)ది నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి. ఒమన్లోని సలాల ప్రాంతంలో ఉన్న అల్ నాసర్ అల్ అరేబియా సంస్థలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు.దీంతో శనివారం పాండ్యా కుటుంబ సభ్యులకు ఒమన్ నుంచి అధికారులు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని వారు కోరుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాండ్యా మృతితో రేకులపల్లిలో విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







