ఒమన్ లో నిజామాబాద్ జిల్లా వాసి మృతి
- August 23, 2020
మస్కట్: ఒమన్ లో నిజామాబాద్ జిల్లా వాసి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మాలవత్ పాండ్యా(33)ది నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి. ఒమన్లోని సలాల ప్రాంతంలో ఉన్న అల్ నాసర్ అల్ అరేబియా సంస్థలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు.దీంతో శనివారం పాండ్యా కుటుంబ సభ్యులకు ఒమన్ నుంచి అధికారులు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని వారు కోరుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాండ్యా మృతితో రేకులపల్లిలో విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







