రాజీనామాకు సోనియాగాంధీ రెడీ..
- August 23, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎక్కువకాలం కాంగ్రెస్ చేతిలోనే అధికారం వుంది. అయితే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభ కోల్పోతోంది. తాజాగా అధ్యక్ష పదవినుంచి తప్పుకోవడానికి సోనియాగాంధీ రెడీ అయ్యారు. తాజాగా కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ సీనియర్ల ఒత్తిడి మేరకు పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురాలేకపోయారు.
ఈ నేపథ్యంలోనే పార్టీలో అంతర్గత సంక్షోభం మరింతగా ముదిరింది. కాంగ్రెస్ పటిష్టం కావడానికి పార్టీ నాయకత్వలో మార్పులు తీసుకురావల్సిన సమయం ఆసన్నమైంది. ఇదే అంశం తెరపైకి వచ్చింది. అయితే గత వారం రోజులుగా జరుగుతున్న అనేక ఉత్కంఠ పరిణామాల అనంతరం.. సోనియా తాత్కాలిక అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసినట్లు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకూ నిజమో కాంగ్రెస్ నేతలే తేల్చాల్చివుంది.
అయితే దీనిపై ఇప్పటి వరకు పార్టీ పెద్దల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు పార్టీలో నాయకత్వ మార్పులు తీసుకురావాలని 23 మంది సీనియర్లు ఆదివారం కాంగ్రెస్ అధినేత్రికి లేఖరాశారు. అంతేకాకుండా పార్టీలోని జూనియర్లు సైతం నాయకత్వ మార్పును కోరుకుంటున్నారు.
తమ స్వరాన్ని వినిపించారు. ఇప్పటికే అధ్యక్ష పదవి నుంచి సోనియా వైదొలిగినట్లు చెబుతున్నారు. అయితే సోమవారం జరుగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేస్తే మరోసారి రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేక కొత్త నేతను ఎన్నుకుంటారా అనేది జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇటీవల సోనియా తనయ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే అవకాశాలున్నాయంటున్నారు. మరి ఆ పీఠం ఎవరికి దక్కనుందో వేచి చూడాల్సిందే...
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







