ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు..
- August 23, 2020
న్యూ ఢిల్లీ: గురుగ్రామ్కు చెందిన ట్రావెల్ కంపెనీ అడ్వెంచర్స్ ఓవర్ల్యాండ్ ఢిల్లీ నుంచి లండన్కు బస్సు నడపనున్నట్లు ప్రకటించింది ఈ బస్పు 18 దేశాల గుండా 70 రోజుల పాటు 20 వేల కి.మీ ప్రయాణిస్తుంది. మయన్మార్, థాయ్లాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జెర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల గుండా బస్సు వెళుతుంది. 20 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్రత్యేక బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఓ గైడ్, హెల్పర్ ఉంటారు.
ఈ ప్రయాణానికి వెళ్లాలనుకునేవారికి వీసా ఏర్పాట్లు కూడా సదరు కంపెనీయే చూసుకుంటుంది.. అన్ని దేశాల్లో కరోనా ఉధృతి తగ్గిన తర్వాత రిజిస్ట్రేషన్ చేపడతామని ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు తుషార్ అగర్వాల్ తెలిపారు. ప్రయాణికులకు స్టార్ హోటళ్లలోనే బస కల్పిస్తామని, ఏ దేశంలో ఉన్నా భారతీయ వంటకాలు ఉండేట్లు చూసుకుంటామని పేర్కొన్నారు. ఈ బస్సు ప్రయాణం వచ్చే ఏడాది మేలో ప్రారంభం కానుంది. దీని టికెట్ ధర రూ.15 లక్షలు గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







