ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు..
- August 23, 2020
న్యూ ఢిల్లీ: గురుగ్రామ్కు చెందిన ట్రావెల్ కంపెనీ అడ్వెంచర్స్ ఓవర్ల్యాండ్ ఢిల్లీ నుంచి లండన్కు బస్సు నడపనున్నట్లు ప్రకటించింది ఈ బస్పు 18 దేశాల గుండా 70 రోజుల పాటు 20 వేల కి.మీ ప్రయాణిస్తుంది. మయన్మార్, థాయ్లాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జెర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల గుండా బస్సు వెళుతుంది. 20 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్రత్యేక బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఓ గైడ్, హెల్పర్ ఉంటారు.
ఈ ప్రయాణానికి వెళ్లాలనుకునేవారికి వీసా ఏర్పాట్లు కూడా సదరు కంపెనీయే చూసుకుంటుంది.. అన్ని దేశాల్లో కరోనా ఉధృతి తగ్గిన తర్వాత రిజిస్ట్రేషన్ చేపడతామని ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు తుషార్ అగర్వాల్ తెలిపారు. ప్రయాణికులకు స్టార్ హోటళ్లలోనే బస కల్పిస్తామని, ఏ దేశంలో ఉన్నా భారతీయ వంటకాలు ఉండేట్లు చూసుకుంటామని పేర్కొన్నారు. ఈ బస్సు ప్రయాణం వచ్చే ఏడాది మేలో ప్రారంభం కానుంది. దీని టికెట్ ధర రూ.15 లక్షలు గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







