దుబాయ్ లో ప్రపంచంలో ఎత్తైన ఫెర్రీస్ వీల్ కు తొలి ప్యాసింజర్ క్యాప్సుల్
- August 24, 2020
దుబాయ్:ఎత్తైన కట్టడాలు, అద్భుత నిర్మాణాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న దుబాయ్..ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫెర్రీస్ వీల్ ను ఏర్పాటు చేస్తోంది. ఐన్ దుబాయ్ లో ఏర్పాటు చేస్తున్న ఈ వీల్ దాదాపు పూర్తి కావొచ్చింది. వీల్ కు తొలి ప్యాసింజర్ క్యాప్సుల్ ఇటీవలె విజయవంతంగా అమర్చినట్లు ఐన్ దుబాయ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మిగిలిన 47 ప్యాసింజర్ క్యాప్సుల్స్ అమరిక ముందుగా నిర్దేశించుకున్న సమయానికల్లా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ఫెర్రీస్ వీల్ సముద్ర మట్టానికి 250 మీటర్ల ఎత్తులో ఉంటుందని..వీల్ పై నుంచి 360 డిగ్రీల కోణంలో దుబాయ్ అందాలను ఆస్వాదించొచ్చని వివరించారు. న్యూయార్క్ లో ఉన్న 190 మీటర్ల వీల్ ఇప్పటి వరకు అతి ఎత్తైన వీల్ గా నమోదైన రికార్డ్ ను ఐన్ దుబాయ్ లోని ఫెర్రీస్ వీల్ బ్రేక్ చేయనుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







