కువైట్:ఓపెన్ హౌజ్ లో ప్రవాస భారతీయుల సంక్షేమ నిధిపై దృష్టి సారించిన ఇండియన్ ఎంబసీ
- August 24, 2020
కువైట్ సిటీ:కువైట్ లో భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఓపెన్ హౌజ్ లో ఈ వారం ప్రవాసభారతీయుల సంక్షేమ నిధిపై దృష్టి సారించారు. సెలవు రోజుల్లో తప్ప మిగిలిన అన్ని రోజులు ఓపెన్ హౌజ్ ఉండగా..దానికి అదనంగా ఈ నెల 19 నుంచి ప్రతి బుధవారం ప్రత్యేకంగా ఓపెన్ హౌజ్ నిర్వహిస్తున్నారు. ప్రవాస భారతీయుల సాధకబాధలు తెలుసుకొని వారికి అవసరమైన సాంకేతిక సాయం చేసేందుకు వీలుగా ఓపెన్ హౌజ్ సమావేశం అవకాశం కల్పిస్తోంది. కువైట్ లో భారత రాయబారిగా కొత్త నియమించబడిన సిబి జార్జ్ ఓపెన్ హౌజ్ సమావేశాలను పునరుద్ధరించిన తర్వాత..భారత రాయబార కార్యాలయం ఈ సారి బుధవారపు సమావేశంలో కువైట్లోని భారతీయుల సంక్షమ నిధి సమీకరణ దిశగా ప్రయత్నాలు చేయనుంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ప్రవాస భారతీయులను ఆదుకునేందుకు ఈ సంక్షేమ నిధిని వినియోగించనున్నారు. ఓపెన్ హౌజ్ సమావేశంలో రాయబార అధికారితో పాటు మిషన్ డిప్యూటీ అధికారి, సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్మిక శాఖలు పాల్గొంటాయి. అయితే..కరోనా నేపథ్యంలో ఓపెన్ హౌజ్ కు పరిమిత సంఖ్యలోనే ప్రజలను అనుమతిస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్..ఫస్ట్ సర్వీస్ ప్రాతిపాదికన ముందుగా రిజిస్టర్ చేసుకున్నవారికి ముందుగా అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







