తెలంగాణ:స్కూల్ విద్యార్థుల‌కు ఆన్‌లైన్ పాఠాలు

- August 24, 2020 , by Maagulf
తెలంగాణ:స్కూల్ విద్యార్థుల‌కు ఆన్‌లైన్ పాఠాలు

హైద‌రాబాద్‌:క‌రోనా ఉధృతి నేప‌థ్యంలో విద్యా సంస్థ‌లు ఇప్ప‌ట్లో తెరుచుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేవు. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం డిజిట‌ల్ బోధ‌న ద్వారా ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. రాష్ట్రంలో వ‌చ్చే నెల 1 నుంచి పాఠ‌శాల‌ల్లో 2020-2021 విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అందులో భాగంగా సెప్టెంబ‌ర్ 1 నుంచి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వహించ‌నున్న‌ట్లు  వెల్ల‌డించింది. ఈ మేర‌కు సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

మూడో త‌ర‌గ‌తి, ఆపై స్థాయి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. కేంద్రం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారమే ఈ త‌ర‌గ‌తులు ఉంటాయ‌ని పేర్కొంది. అయితే ఈ త‌ర‌గ‌తుల ప్రారంభానికి ముందే ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్ల‌కు రావాల్సి ఉంటుంద‌ని ఆదేశాలు జారీ చేసింది. కాగా విద్యా సంవ‌త్స‌రం ప్రారంభంపై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఈ నెల 5న భేటీ జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో విద్యా సంవ‌త్స‌ర ప్రారంభం స‌హా అడ్మిషన్ల ప్రక్రియ, విద్యా బోధన ఎలా జ‌ర‌పాలి అన్న అంశాలపై ప్రభుత్వం చ‌ర్చించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com