మళ్లీ పట్టాలెక్కనున్న దోహా మెట్రో..అతి త్వరలో సర్వీసుల పునరుద్ధరణ

- August 25, 2020 , by Maagulf
మళ్లీ పట్టాలెక్కనున్న దోహా మెట్రో..అతి త్వరలో సర్వీసుల పునరుద్ధరణ

దోహా:కోవిడ్ నేపథ్యంలో ఇన్నాళ్లు నిలిచిపోయిన దోహా మెట్రో..తిరిగి సర్వీసులను ప్రారంభించేందుకు సంసిద్ధం అవుతోంది. అన్ లాక్ నాలుగో దశలో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇవ్వబోతున్నట్లు సంకేతాలున్నాయి. అయితే..ఏ తేది నుంచి ప్రారంభించబోతున్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తేది ఖరారు కానప్పటికీ మెట్రో సర్వీసులు మళ్లీ పట్టాలెక్కనున్న నేపథ్యంలో దోహా మెట్రో అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రయాణికులు భౌతిక దూరం పాటించాలంటూ అవగాహన కల్పించేలా దాదాపు 18 వేల చోట్ల సందేశాలు అమర్చారు. అలాగే ప్రతి స్టేషన్ లో ప్రయాణికుడికి థర్మల్ టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. పలు కీలక ప్రాంతాల్లో దాదాపు 300 శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com