తెలంగాణ లో కొత్తగా 2,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- August 25, 2020
హైదరాబాద్:తెలంగాణ లో కరోనా విజృంభిస్తోంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 2579 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,08,670 కు చేరింది. తాజాగా 9 మంది వైరస్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 770 కి చేరింది. తాజాగా 1752 మంది కోవిడ్ పేషంట్లు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 84,163 కు చేరింది. ప్రస్తుతం 23,737 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 75.27 శాతంగా ఉండగా.. తెలంగాణలో రికవరీ రేటు 77.44 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 10,21,054 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







