మళ్లీ పట్టాలెక్కనున్న దోహా మెట్రో..అతి త్వరలో సర్వీసుల పునరుద్ధరణ
- August 25, 2020
దోహా:కోవిడ్ నేపథ్యంలో ఇన్నాళ్లు నిలిచిపోయిన దోహా మెట్రో..తిరిగి సర్వీసులను ప్రారంభించేందుకు సంసిద్ధం అవుతోంది. అన్ లాక్ నాలుగో దశలో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇవ్వబోతున్నట్లు సంకేతాలున్నాయి. అయితే..ఏ తేది నుంచి ప్రారంభించబోతున్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తేది ఖరారు కానప్పటికీ మెట్రో సర్వీసులు మళ్లీ పట్టాలెక్కనున్న నేపథ్యంలో దోహా మెట్రో అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రయాణికులు భౌతిక దూరం పాటించాలంటూ అవగాహన కల్పించేలా దాదాపు 18 వేల చోట్ల సందేశాలు అమర్చారు. అలాగే ప్రతి స్టేషన్ లో ప్రయాణికుడికి థర్మల్ టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. పలు కీలక ప్రాంతాల్లో దాదాపు 300 శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







