రాముడిగా ప్రభాస్ పర్ఫెక్ట్: రాజమౌళి
- August 25, 2020ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ మూడు భారీ సినిమాలు చేస్తున్నారు. మూడూ పాన్ ఇండియా చిత్రాలు. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న చిత్రాలివి. అందులో `రాధేశ్యామ్` ప్రస్తుతం తెరకెక్కుతుండగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ చేయబోతున్నాడు. దీంతోపాటు అందరిని సర్ప్రైజ్ చేస్తూ గత వారం `ఆదిపురుష్` పేరుతో ఓ పౌరాణిక ప్రాజెక్ట్ ని ప్రభాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రాముడిపై ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా, రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు.
తాజాగా `ఆదిపురుష్` ప్రాజెక్ట్ పై దర్శకుధీరుడు రాజమౌళి స్పందించారు. ఈ ప్రాజెక్ట్ గురించి అందరికంటే ముందు తనకే తెలుసన్నారు. ఆయన చెబుతూ, `ఆదిపురుష్` చిత్ర పోస్టర్ని అందరికంటే ముందే చూశా. అద్భుతంగా ఉంది. రాముడి పాత్రకి ప్రభాస్ పర్ఫెక్ట్ యాప్ట్, ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. ఈ సమయంలో రాముడిపై సినిమా తీయడం అభినందనీయం` అని చెప్పారు.
`దేశం మొత్తం రాముడి గురించి చర్చ జరుగుతుండగా, ఆయనపై సినిమా వస్తే దానికి మరింత క్రేజ్ వస్తుంది. అందరిలోనూ ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా ప్రభాస్ స్థాయిని పెంచుతుంది. సినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. విజువల్ వండర్గా ఈ చిత్రం ఉండబోతుందని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఆయన `ఆర్ ఆర్ ఆర్` పేరుతో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్తో మల్టీస్టారర్గా తెరకెక్కుతుంది. ఇది కూడా గ్రాండియర్గా రూపుదిద్దుకుంటోంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్