IPL నుంచి తప్పుకున్న సురేష్ రైనా

- August 29, 2020 , by Maagulf
IPL నుంచి తప్పుకున్న సురేష్ రైనా

దుబాయ్:టీం ఇండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా IPL నుంచి తప్పుకున్నాడు.ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.సురేష్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల భారతదేశానికి తిరిగి వచ్చారని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కె.ఎస్ విశ్వ నాథన్ తెలిపారు. అతను మిగిలిన IPL సీజన్ లో అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ సురేష్ మరియు అతని కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు.

IPL వచ్చే నెల 17 నుంచి జరుగుతుంది. ఈ టోర్నీ కోసం గానూ ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ చేరుకున్నాయి. నిన్న చెన్నై ఫాస్ట్ బౌలర్ ఒకరికి కరోనా వచ్చినట్టు నిర్ధారించారు. అలాగే 11 మంది స్టాఫ్ కి కూడా కరోనా సోకిందని నిర్ధారించారు. దీనితో అప్రమత్తం అయ్యాయి మిగిలిన IPL టీమ్స్ కూడా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com