జ్లీబ్ ఫీల్డ్ క్లినిక్ ఏడాది చివరి వరకూ!
- August 29, 2020
కువైట్ సిటీ:జ్లీబ్ అల్ షుయోక్లో ఏర్పాటు చేయబడిన తాత్కాలిక ఫీల్డ్ క్లినిక్ ఈ ఏడాది చివరి వరకు కొనసాగనుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ యూత్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కరోనా వైరస్పై పోరులో భాగంగా ఈ క్లినిక్ని ఈ ఏడాది వరకు కొనసాగించేందుకు మినిస్ట్రీ అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎలాంటి పాజిటివ్ కేసులూ లేకపోవడంతో ఈ కేంద్రాన్ని మూసివేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మాత్రం, దీన్ని కొనసాగించాల్సిందిగా సూచించింది. వచ్చే వింటర్ సీజన్ ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నారు. జ్లీబ్ అల్ షుయోక్ ప్రాంత రెసిఎంట్స్కి మెడికల్ సర్వీసెస్ అందించడంలో ఈ సెంటర్ కీలక పాత్ర పోషించింది. తద్వారా అల్ ఫర్వానియా ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







