కరోనా ఎఫెక్ట్: ఎయిర్ షో రద్దు
- August 31, 2020
మనామా:బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో (బిఐఎఎస్) సుప్రీం ఆర్గనైజింగ్ కమిటీ, 2020 ఈవెంట్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి నవంబర్ 18 నుంచి 20 వరకు ఈ షో జరగాల్సి వుంది. అయితే, కరోనా నేపథ్యంలో ఈ ఎయిర్ షోని రద్దు చేస్టున్నట్లు బిఐఎఎస్ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎయిర్ షో రద్దు చేయడం జరిగిందనీ, ప్రపంచ దేశాల్లో కరోనా ప్రకంపనల నేపథ్యంలో డెలిగేట్స్, పార్టిసిపెంట్స్, పార్టనర్స్ అభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, 2022లో అత్యంత ప్రతిష్టాత్మకంగా షో నిర్వహిస్తామని బిఐఎఎస్ తెలిపింది. 2010లో తొలి ఎడిషన్ జరిగిందనీ, అప్పటినుంచీ ఈ షో అత్యద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









