పెద్దాయన కార్యక్రమానికి భారీ ఎదురుదెబ్బ
- August 31, 2020
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మనసులో మాటలు వినిపించే రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' ఆగస్టు కార్యక్రమం డిస్లైక్ల్లో రికార్డు సృష్టించింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన యూట్యూబ్ ఛానల్లో దీనిని పెట్టిన 24 గంటల్లోనే అత్యధికులు డిస్లైక్ చేసిన వీడియోల్లో ఒకటిగా నిలిచింది. జాతిని ఉద్దేశించి మోదీ ఆదివారం రేడియో ద్వారా 'మన్ కీ బాత్' వినిపించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన దేశీయ కుక్కలను పెంచుకోవాలని, ఆట బొమ్మలను మన దేశంలోనే తయారు చేసుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జేఈఈ, నీట్ పరీక్షల గురించి మోదీ మాట్లాడకపోవడాన్ని చాలా మంది ప్రశ్నించారు. మొత్తం మీద ఈ వీడియోను 18 లక్షల మందికి పైగా వీక్షించగా, 74 వేల మంది లైక్ చేశారు, 5 లక్షల మంది డిస్లైక్ చేశారు.
'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ ఆంధ్ర ప్రదేశ్లోని ఏటికొప్పాక బొమ్మల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









