భారత్లో కొత్తగా 69,921 కరోనా కేసులు
- September 01, 2020
భారత్లో కరోనా కోరలు చాస్తూనే ఉంది. గత 24 గంటల్లో భారత్లో 69,921 కేసులు నమోదు కాగా, 819 మంది ప్రాణాలు విడిచారు. దీంతో దేశంలో కేసుల సంఖ్య మొత్తం 36,91,173 కు చేరుకుంది. అలాగే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 65,081 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,85,996 ఉండగా, 28,39,882 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 65,288 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.94 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.77 శాతానికి తగ్గింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు