ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ
- September 02, 2020అమరావతి:ఏ.పిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 10వేల 392 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపిలో మొత్తం కేసులు సంఖ్య 4లక్షల 55వేల 531కి చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో 72మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 4వేల 125 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల 48వేల 330 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. లక్షా 3వేల 76 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఒక్కరోజులోనే అత్యధికంగా 11మంది కోవిడ్ బారిన పడి మృత్యువాతపడ్డారు. చిత్తూరులో 10మంది, పశ్చిమగోదావరిలో 9, ప్రకాశం జిల్లాలో 8మంది మృతిచెందారు. ఇక కృష్ణా, విశాఖ జిల్లాలో ఆరుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు