తెలంగాణ వాసికి బిల్లు మాఫీ చేసిన అల్ ధైద్ హాస్పిటల్
- September 03, 2020
యూఏఈ:యూఏఈలో తెడ్డు లక్ష్మణ్ అనే గల్ఫ్ కార్మికుడు గత ఐదు నెలల క్రితం సహాయం పొందిన 300 వందల మందిలో ఒకడు అతనికి కుడి చెయ్యి ఎదో తెలియని నొప్పితో భాదపడంతో ఎస్వీ రెడ్డి(TPCC NRI సెల్ కన్వీనర్)కి చెప్పడం జరిగింది.షార్జా పోలీస్ అకాడమీ కెప్టెన్ హుమెద్ సహాయంతో వెంటనే అల్ ధైద్ లోని అల్ ధైద్ హాస్పిటల్ కు తరలించండం జరిగింది.అక్కడ చెయ్యి కి మూడు రకాల ఆ పెరేషన్లు చేసి రెండు నెలలుగా చికిత్స చేశారు.పూర్తిగా నయం అయ్యింది కాని హాస్పిటల్ బిల్లు అన్ని డిస్కౌంట్ లు చేశాక 22,000 దిర్హామ్స్(5లక్షల రూపాయలు) అయ్యింది.ఈ డబ్బులు కడితే కాని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చెయ్యరు. ఆ సమయంలో ఎస్వీ రెడ్డి హాస్పిటల్ వారికి తెడ్డు లక్ష్మణ్ పరిస్థితి వివరించంగా వాళ్ళు కనికరించి మానవతా దృక్పధంతో మొత్తం హాస్పిటల్ బిల్లు మాఫీ చేసారు.బిల్లు మాఫీ చేసినందుకు హాస్పిటల్ సిబ్బందికి ఎస్వీ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.తెడ్డు లక్ష్మన్ గత పది సంవత్సరాలుగా దుబాయ్ లో విజిట్ విసాలో వచ్చి ఇక్కడే ఉండిపోయాడు.అతని దగ్గర పాస్పోర్ట్ లేక ఇప్పుడు ఇండియన్ కాన్సిలిట్ సహకారంతో ఎమెర్జిన్సి పాస్పోర్ట్ కి అప్లై చెయ్యటం జరిగింది.గత 5 నెలలుగా తనకు సహాయసహకారాలు అందించిన ఎస్వీ రెడ్డికి తెడ్డు లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపాడు.

తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







