తెలంగాణ వాసికి బిల్లు మాఫీ చేసిన అల్ ధైద్ హాస్పిటల్
- September 03, 2020యూఏఈ:యూఏఈలో తెడ్డు లక్ష్మణ్ అనే గల్ఫ్ కార్మికుడు గత ఐదు నెలల క్రితం సహాయం పొందిన 300 వందల మందిలో ఒకడు అతనికి కుడి చెయ్యి ఎదో తెలియని నొప్పితో భాదపడంతో ఎస్వీ రెడ్డి(TPCC NRI సెల్ కన్వీనర్)కి చెప్పడం జరిగింది.షార్జా పోలీస్ అకాడమీ కెప్టెన్ హుమెద్ సహాయంతో వెంటనే అల్ ధైద్ లోని అల్ ధైద్ హాస్పిటల్ కు తరలించండం జరిగింది.అక్కడ చెయ్యి కి మూడు రకాల ఆ పెరేషన్లు చేసి రెండు నెలలుగా చికిత్స చేశారు.పూర్తిగా నయం అయ్యింది కాని హాస్పిటల్ బిల్లు అన్ని డిస్కౌంట్ లు చేశాక 22,000 దిర్హామ్స్(5లక్షల రూపాయలు) అయ్యింది.ఈ డబ్బులు కడితే కాని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చెయ్యరు. ఆ సమయంలో ఎస్వీ రెడ్డి హాస్పిటల్ వారికి తెడ్డు లక్ష్మణ్ పరిస్థితి వివరించంగా వాళ్ళు కనికరించి మానవతా దృక్పధంతో మొత్తం హాస్పిటల్ బిల్లు మాఫీ చేసారు.బిల్లు మాఫీ చేసినందుకు హాస్పిటల్ సిబ్బందికి ఎస్వీ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.తెడ్డు లక్ష్మన్ గత పది సంవత్సరాలుగా దుబాయ్ లో విజిట్ విసాలో వచ్చి ఇక్కడే ఉండిపోయాడు.అతని దగ్గర పాస్పోర్ట్ లేక ఇప్పుడు ఇండియన్ కాన్సిలిట్ సహకారంతో ఎమెర్జిన్సి పాస్పోర్ట్ కి అప్లై చెయ్యటం జరిగింది.గత 5 నెలలుగా తనకు సహాయసహకారాలు అందించిన ఎస్వీ రెడ్డికి తెడ్డు లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం