హైదరాబాద్:సెప్టెంబర్ 7నుంచి మెట్రో రైల్ తిరిగి ప్రారంభం
- September 03, 2020
హైదరాబాద్:పరుగులు తీసేందుకు మెట్రో ట్రైన్ సిద్ధమైంది. ఈ నెల 7వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ తిరిగి ప్రారంభం కానుంది. మెట్రో రైళ్ల పున ప్రారంభంపై మెట్రో MD NVS రెడ్డి, L&T MD KVB రెడ్డి సమీక్షా సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.. ప్యాసింజర్లను బట్టి ఫ్రీక్వెన్సీ పై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.. మెట్రో స్టేషన్లతో పాటూ రైళ్లలో భౌతిక దూరం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, భౌతిక దూరాన్ని సీసీ టీవీల ద్వారా పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నారు..
మెట్రో ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేయనున్నారు. మాస్క్ లేకపోతే ఫెనాల్టీలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా లక్షణాలు లేని వాళ్లకు మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతి ఇవ్వనున్నారు. అలాగే మెట్రో ఉద్యోగుల కు పిపిఇ కిట్లు ఇవ్వాలని నిర్ణయించారు. స్మార్ట్ కార్డు, క్యాష్ లెస్ విధానంలో టికెట్లు జారీ చేయనున్నారు. హైదరాబాద్లో మెట్రో సేవలు దశ వారిగా ప్రారంభం కానున్నాయి. ఒకటవ దశ కారిడార్ 1 మియాపూర్ నుండి ఎల్బి నగర్ వరకు, రెండో దశ సెప్టెంబర్ 8 నుంచి కారిడార్ 3 నాగోల్ నుండి రాయ దుర్గ్ వరకు.. మూడో దశ పెప్టెంబర్ 9 నుంచి మూడు కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి ఐదు నిమిషాలకు ఒక మెట్రో ట్రైన్ నడపనున్నారు. గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్ యూసుఫ్ గూడ స్టేషన్ల మూసివేయనున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







