కోవిడ్19:పాక్షిక కర్ఫ్యూ మళ్లీ విధిస్తున్నారన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన కువైట్
- September 04, 2020
కువైట్ సిటీ:కువైట్ లో మళ్లీ పాక్షికంగా కర్ఫ్యూని విధిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. గురువారం ఒక్క రోజే కువైట్ లో 900 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే..కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ పాక్షికంగా కర్ఫ్యూ విధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వదంతలు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కర్ఫ్యూ విధింపు స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఎలాంటి కర్ఫ్యూ విధించే యోచన లేదని తెలిపింది. కరోనా కేసులు గతంలో కన్నా ఎక్కువగా నమోదవుతున్నా..షాపులు, మార్కెట్లు సివేయబోమని తేల్చి చెప్పింది. అయితే..కరోనా తీవ్రత పెరగటానికి ప్రజలు సరైన జాగ్రత్తలు పాటించకపోవటమేనని ఆరోగ్యశాఖ వెల్లడించింది. భౌతిక దూరం పాటించకుండా ఇళ్లలో, ఆఫీసులలో గుమిగూడటమే వైరస్ వ్యాప్తికి కారణం అవుతోందని..అలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించింది.
తాజా వార్తలు
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!









