కువైట్: విదేశాల్లో చిక్కుకుపోయిన వలసదారులకు వేతనాల్లేవ్
- September 05, 2020
కువైట్ సిటీ:కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన ఉద్యోగులకు, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ‘అబ్జెంట్’గా పరిగణించడం జరుగుతుందనీ, వారికి వేతనాలు చెల్లించబడవని కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. మొత్తం 32 దేశాల నుంచి వచ్చే విమానాలపై కువైట్ బ్యాన్ విధించిన విషయం విదితమే. మార్చి 12కి ముందు రెగ్యులర్ హాలీడేస్ నేపథ్యంలో తమ స్వస్థలాలకు వెళ్ళిన వలసదారులకు, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సెలవులు ప్రకటించిన విషయం విదితమే. ప్రభుత్వం జారీ చేసిన సెలవులకు సంబంధించి జీతాల చెల్లింపు జరుగుతుంది. కాగా, వైరస్ సంబంధిత రిస్ట్రక్షన్స్ నుంచి ఇటీవల కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగింది. తద్వారా తిరిగి వర్క్లో చేరడానికి ఆస్కారం కల్పించారు. ట్రావెల్ సమస్యల కారణంగా ఉద్యోగులు తిరిగి కువైట్కి రాలేని పక్షంలో, వారికి ‘నో పెయిడ్’ లీవ్గా పరిగణిస్తారు. అయితే, వారికి ఇంకా సెలవులు వున్నట్లయితే, వాటి నుంచి మినహాయించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







