కువైట్: విదేశాల్లో చిక్కుకుపోయిన వలసదారులకు వేతనాల్లేవ్
- September 05, 2020
కువైట్ సిటీ:కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన ఉద్యోగులకు, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ‘అబ్జెంట్’గా పరిగణించడం జరుగుతుందనీ, వారికి వేతనాలు చెల్లించబడవని కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. మొత్తం 32 దేశాల నుంచి వచ్చే విమానాలపై కువైట్ బ్యాన్ విధించిన విషయం విదితమే. మార్చి 12కి ముందు రెగ్యులర్ హాలీడేస్ నేపథ్యంలో తమ స్వస్థలాలకు వెళ్ళిన వలసదారులకు, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సెలవులు ప్రకటించిన విషయం విదితమే. ప్రభుత్వం జారీ చేసిన సెలవులకు సంబంధించి జీతాల చెల్లింపు జరుగుతుంది. కాగా, వైరస్ సంబంధిత రిస్ట్రక్షన్స్ నుంచి ఇటీవల కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగింది. తద్వారా తిరిగి వర్క్లో చేరడానికి ఆస్కారం కల్పించారు. ట్రావెల్ సమస్యల కారణంగా ఉద్యోగులు తిరిగి కువైట్కి రాలేని పక్షంలో, వారికి ‘నో పెయిడ్’ లీవ్గా పరిగణిస్తారు. అయితే, వారికి ఇంకా సెలవులు వున్నట్లయితే, వాటి నుంచి మినహాయించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







