కువైట్: విదేశాల్లో చిక్కుకుపోయిన వలసదారులకు వేతనాల్లేవ్
- September 05, 2020
కువైట్ సిటీ:కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన ఉద్యోగులకు, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ‘అబ్జెంట్’గా పరిగణించడం జరుగుతుందనీ, వారికి వేతనాలు చెల్లించబడవని కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. మొత్తం 32 దేశాల నుంచి వచ్చే విమానాలపై కువైట్ బ్యాన్ విధించిన విషయం విదితమే. మార్చి 12కి ముందు రెగ్యులర్ హాలీడేస్ నేపథ్యంలో తమ స్వస్థలాలకు వెళ్ళిన వలసదారులకు, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సెలవులు ప్రకటించిన విషయం విదితమే. ప్రభుత్వం జారీ చేసిన సెలవులకు సంబంధించి జీతాల చెల్లింపు జరుగుతుంది. కాగా, వైరస్ సంబంధిత రిస్ట్రక్షన్స్ నుంచి ఇటీవల కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగింది. తద్వారా తిరిగి వర్క్లో చేరడానికి ఆస్కారం కల్పించారు. ట్రావెల్ సమస్యల కారణంగా ఉద్యోగులు తిరిగి కువైట్కి రాలేని పక్షంలో, వారికి ‘నో పెయిడ్’ లీవ్గా పరిగణిస్తారు. అయితే, వారికి ఇంకా సెలవులు వున్నట్లయితే, వాటి నుంచి మినహాయించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









